ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు మోదీ పుష్ప నివాళి
- March 30, 2016
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ పుష్ప నివాళి అర్పించారు. భారత్, యురోపియన్ యూనియన్ మధ్య జరగనున్న శిఖరాగ్ర సదస్సులో పాల్గోనేందుకు మోదీ బ్రస్సెల్స్ వెళ్లారు. మాల్బీక్ మెట్రో స్టేషన్ దగ్గర మోదీ పుష్పగుచ్ఛం ఉంచారు. దాడి జరిగిన రోజున అక్కడ సుసైడ్ బాంబర్ తనను తాను పేల్చుకున్నాడు. ఆ పేలుడులో ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశన్ మృతిచెందాడు. బ్రస్సెల్స్లో వారం రోజుల క్రితం జరిగిన పేలుళ్లలో సుమారు 32 మంది మృతిచెందారు. మాల్బీక్ స్టేషన్ దగ్గర జరిగిన పేలుడులోనే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. బెల్జియం, యురోపియన్ యూనియన్ నేతలతో మోదీ భేటీ అయ్యారు.
ఎగ్మోంట్ ప్యాలెస్లో ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







