ఆంధ్ర కళా వేదిక ఖతార్ వారి అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ వేడుక
- February 26, 2022
దోహా: తెలుగు బాషా అభివృద్ధి మరియు పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ మాతృ బాషా దినోత్సవ కార్యక్రమాన్ని “ఆంధ్ర కళా వేదిక” వారు 21-ఫిబ్రవరి-2022 (సోమవారం) ICC అశోకా హాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐసిసి ప్రెసిడెంట్ పిఎన్ బాబు రాజన్, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ కెఎస్ ప్రసాద్ మరియు ఐసిబిఎఫ్ నుంచి రజనీ మూర్తి వంటి పలువురు ప్రముఖులతో పాటుగా ఇతర ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ బృందం సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక యొక్క కార్యనిర్వాహక వర్గాన్ని వారితో పాటు పాల్గొన్న వారందరినీ అభినందించారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అపూర్వమైన స్పందన లభించిందని, తెలుగు వారందరిలో మాతృభాష పట్ల అభిమానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ కార్యవర్గ బృందం చేసిన కృషి ఫలించిందని పేర్కొన్నారు. యువతలో మరియు పెద్దలలో మాతృ భాష పట్ల స్ఫూర్తిని పునరుజ్జీవింపజేసే విధంగా 3 రోజుల ముందుగా అందరికి పోటీలు(చిట్టి గీతాలు, పద్యాలు, శతకాలు, ప్రముఖ వ్యక్తుల పై ప్రసంగాలు, సామెత సమేత కధలు మొదలుగునవి..) నిర్వహించటం జరిగిందని, పోటీలలో 2 1/2 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయసు వరకు అభ్యర్థులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహవంతంగా మలిచారని చెప్పారు.
“కార్యక్రమంలో చిన్నారుల అద్భుతమైన ప్రదర్శనలు(ఏకపాత్రాభినయం, నృత్యాలు, పాటలు), తెలుగు బాషా బోధనా ఉపాధ్యాయులను మరియు న్యాయనిర్ణేతలను వేదికపై సన్మానించటం ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.” పోటీలలో విజేతలుగా నిలిచినవారికి మరియు పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు మరియు బహుమతులను అందజేయటం జరిగింది. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా శిరీష మరియు సుధ వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన దాతలకు(స్పాన్సర్స్)కి, న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఉపాధ్యాయులకు, స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
--రాజ్ కుమార్ వనాంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
_1645881680.jpg)

తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







