`సర్కారు వారి పాట` శివరాత్రి స్పెషల్ పోస్టర్
- March 01, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ అంచనాలున్న చిత్రం `సర్కారు వారి పాట` నిర్మాణం చివరి దశలో ఉంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ప్రధాన తారాగణం షూటింగ్లో పాల్గొంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.
మహా శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను నేడు ఆవిష్కరించారు. సినిమాలో రౌడీ గ్యాంగ్తో మహేష్ బాబు పోరాడే సన్నివేశంలో కనిపిస్తాడు. సినిమాలో మంచి యాక్షన్ డోస్ ఉంటుందని, పోస్టర్ కూడా అదే సూచిస్తోందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సెన్సేషనల్ కంపోజర్ S S థమన్ సంగీతం అందించారు ఇప్పటికే మొదటి సింగిల్ `కళావతికి` 50 మిలియన్లకు పైగా వీక్షణలతో అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్లో ఉంది.
మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆర్ మధి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్గా, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డిపార్ట్ మెంట్స్ చూసుకుంటున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న సమ్మర్ కానుకగా రాబోతోంది.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







