బ్యాంక్ని మోసం చేసిన కేసులో వ్యక్తికి జైలు
- March 31, 2016
ఓ బ్యాంక్ని మోసం చేసిన కేసులో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను విధించారు. 700,000 దిర్హామ్లు ఈ కేసులో సదరు వ్యక్తి బ్యాంకుకు బురిడీ కొట్టించాడు. పాకిస్తాన్కి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి బ్యాంక్ని మోసం చేశాడు. రెసిడెన్స్ వీసా మరియు ఎమిరేట్స్ ఐడీని కూడా ఫోర్జరీ చేసి బ్యాంకుని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి గతంలోనూ ఇలాంటి అనేక నేరాలకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ విచారణలో వెల్లడయ్యింది. గతంలో బ్యాంకుని బురిడీ కొట్టించి, 408,000 దిర్హామ్లు నొక్కేసినట్లు విచారణాధికారులు వెల్లడించారు. క్రెడిట్ కార్డుల్ని కూడా ఫ్రాడ్ చర్యలకు వినియోగించాడు ఆ వ్యక్తి. తనకు పడ్డ శిక్షపై 15 రోజుల్లోగా ఆ వ్యక్తి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







