దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- March 31, 2016
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీ మరియు ఇన్వెస్టిగేషన్స్ ముగ్గురు ఒమనీ పౌరుల్ని అరెస్ట్ చేసింది. విలాయత్ సువైక్లో ఈ ముగ్గురూ దొంగతనానికి పాల్పడినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. అమాయకుల్ని, తమతోపాటు వాహనంలో ఎక్కించుకుని, వారిని గమ్యస్థానాలకు చేర్చుతామని చెప్పి, దారి తప్పించి వారిని దోచుకోవడం ఈ దొంగలకు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు చెప్పారు. బాధితుల నుంచి డబ్బు, నగలు, సెల్ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువల్ని దోచుకుని, అక్కడి నుంచి ఆ దొంగలు పరారైపోతుండేవారు. నిందితుల్లో ఒకరు టైర్ షాప్ నుంచి 8 కార్ టైర్లను దొంగిలించాడు. ఆ టైర్లను తమ దొంగతనాలకు వినియోగిస్తున్న కారుకే వాడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







