దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌

- March 31, 2016 , by Maagulf
దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్‌


డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంక్వైరీ మరియు ఇన్వెస్టిగేషన్స్‌ ముగ్గురు ఒమనీ పౌరుల్ని అరెస్ట్‌ చేసింది. విలాయత్‌ సువైక్‌లో ఈ ముగ్గురూ దొంగతనానికి పాల్పడినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు. అమాయకుల్ని, తమతోపాటు వాహనంలో ఎక్కించుకుని, వారిని గమ్యస్థానాలకు చేర్చుతామని చెప్పి, దారి తప్పించి వారిని దోచుకోవడం ఈ దొంగలకు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు చెప్పారు. బాధితుల నుంచి డబ్బు, నగలు, సెల్‌ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువల్ని దోచుకుని, అక్కడి నుంచి ఆ దొంగలు పరారైపోతుండేవారు. నిందితుల్లో ఒకరు టైర్‌ షాప్‌ నుంచి 8 కార్‌ టైర్లను దొంగిలించాడు. ఆ టైర్లను తమ దొంగతనాలకు వినియోగిస్తున్న కారుకే వాడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com