దోహా మెట్రో: గ్రీన్లైన్లో టన్నెలింగ్ వర్క్ పూర్తి
- March 31, 2016
ఖతార్ రైల్, గ్రీన్లైన్లో టన్నెలింగ్ పనులు పూర్తయినట్లు ప్రకటించింది. టన్నెల్ బోరింగ్ మెషీన్ ఎడ్యుకేషన్ సిటీ వద్ద ఈ పని పూర్తయ్యింది. ఇది ఆఖరి అండర్గ్రౌండ్ స్టేషన్. ఇటీవలే రెడ్ లైన్లోని నార్తరన్ సెక్షన్లో టన్నెల్ వర్క్ పూర్తికాగా, ఆ తర్వాత పది రోజుల్లోనే గ్రీన్లైన్లో టన్నెలింగ్ పనులు పూర్తవడం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రీన్లైన్ అండర్ గ్రౌండ్ స్టేషన్ పనులు 57 శాతం పూర్తి కాగా, ఓవరాల్ దోహా మెట్రో టన్నెలింగ్ ప్రక్రియ 87 శాతం పూర్తయ్యింది. 2014లో టన్నెలింగ్ వర్క్ ప్రారంభమైంది. ఆరు టన్నెల్ బోరింగ్ మెషీన్లను ఇందుకోసం వినియోగించారు. ఇందులో 22 కిలోమీటర్ల ఆపరేషన్ లైన్, 10 అండర్ గ్రౌండ్ స్టేషన్స్, ఒకటి మామూలు స్టేషన్ నిర్మిస్తున్నారు. గ్రీన్లైన్లో 19 కిలోమీటర్లు భూమి లోపల, 3 కిలోమీటర్ల భూమిపైన ఉంటుంది. 2019 నాలుగో క్వార్టర్లో దోహా మెట్రో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. దోహా మెట్రో ఫస్ట్ ఫేస్ మరియు లుసైల్ ట్రామ్ 600,000 ప్యాసింజర్లు ప్రతిరోజూ ప్రయాణించే వీలుంటుందని ఖతార్ రైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం 37 మెట్రో స్టేషన్లు, ఓ స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి సగటు ప్రయాణ కాలం మూడు నిమిషాలుగా ఉంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







