ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు సాయం

- March 31, 2016 , by Maagulf
ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు సాయం

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.900 కోట్లు విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి రూ.500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.200 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కు రూ.200 కోట్లు విడుదల చేసింది. కాగా రెవెన్యూ లోటు భర్తీకి ఏపీ సర్కార్ రూ.13,700 కోట్లు కేంద్రాన్ని సాయం కోరింది.అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసింది. పోలవరానికి పాత బిల్లుల కింత రూ.2,500 కోట్లు అభ్యర్థన పెట్టుకుంటే, రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం విదిల్చింది. ఇక అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు కోరితే, కేంద్రం రూ.200 కోట్లుతో సరిపెట్టింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com