2022-23 విద్యా సంవత్సరానికి దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు లేదు
- March 02, 2022
దుబాయ్: దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళు, 2022-23 విద్యా సంవత్సరానికిగాను రుసుముల్ని పెంచకూడదు. దుబాయ్ స్టాిస్టిక్స్ సెంటర్ లెక్కించిన ఇండెక్స్ ప్రకారం స్కూళ్ళను నడిపేందుకు అయ్యే ఖర్చుని ఇసిఐ మైనస్ 1.01 శాతంగా నిర్ధారించింది. రెగ్యులేషన్స్ మరియు పర్మిట్స్ కమిషన్ (నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ) సీఈఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళు గతంలోలానే మెరుగైన విద్యను అందిస్తాయనీ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాయనీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ కాస్ట్ ఇండెక్స్ మరియు ఫీ ఫ్రేమ్ వర్క్, దుబాయ్ ప్రభుత్వ సంస్థలు దుబాయ్ స్టాటిస్టిక్స్ సెంటర్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటివాటి సూచనలతో రూపొందుతాయి.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









