దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు : సీఎం కేసీఆర్
- March 04, 2022
రాంచీ: సీఎం కెసిఆర్ జాతీయ స్థాయిలో తృతీయ కూటమి కోసం యత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న కేసీఆర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్తో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు, ఆ దిశగా సాగాల్సిన ఆవశ్యతపై ఆయన సోరేన్తో చర్చించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్దిపై కేసీఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి సరకొత్త దశ, దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం 70 ఏళ్లు దాటినా దేశంలో ఆశించిన మేర అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటికంటే మెరుగైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ప్రత్యామ్నయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కూడా కేసీఆర్ చెప్పు కొచ్చారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







