దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు : సీఎం కేసీఆర్
- March 04, 2022
రాంచీ: సీఎం కెసిఆర్ జాతీయ స్థాయిలో తృతీయ కూటమి కోసం యత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకున్న కేసీఆర్ తిరుగు ప్రయాణంలో భాగంగా ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్తో భేటీ అయ్యారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు, ఆ దిశగా సాగాల్సిన ఆవశ్యతపై ఆయన సోరేన్తో చర్చించారు. ఈ సందర్భంగా దేశ అభివృద్దిపై కేసీఆర్ తనదైన వ్యాఖ్యలు చేశారు.
దేశానికి సరకొత్త దశ, దిశ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని కేసీఆర్ చెప్పారు. దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు ప్రారంభమయ్యాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం 70 ఏళ్లు దాటినా దేశంలో ఆశించిన మేర అభివృద్ది జరగలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో ఇప్పటికంటే మెరుగైన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. దేశాన్ని సరైన దిశలో నడిపేందుకు ఏ మార్గాన్ని అనుసరిస్తే బాగుంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశంలో ప్రత్యామ్నయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని కూడా కేసీఆర్ చెప్పు కొచ్చారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







