హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం: ఏపీ హోం మంత్రి సుచరిత
- March 04, 2022
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గబోదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును ఖచ్చితంగా సవాల్ చేసి తీరతామని ఆమె పేర్కొన్నారు.
శుక్రవారం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంటును ఆమె ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని కూడా ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీకి రాయల్ ఎన్ఫీల్డ్..‘రాయల్ సీమ’ అంటు బాబు ఆసక్తికర ట్వీట్
- సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో దర్యాప్తు వేగవంతం
- కోవిడ్ కంటే డేంజర్ వైరస్..ప్రపంచ దేశాలకు అప్రమత్తం చేసిన WHO
- ఐపీఎల్ ఆటగాళ్లకు BCCI హెచ్చరిక
- విజయ్ సంచలన నిర్ణయం..
- క్రూయిజ్ షిప్లో హంటావైరస్ కలకలం..15 దేశాల్లో హై అలర్ట్!
- హర్మూజ్లో ఉద్రిక్తత.. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పులు
- బహ్రెయిన్లో డ్రగ్ ట్రాఫికింగ్..లైఫ్ సెంటెన్స్..!!
- జలీబ్ అల్-షుయూఖ్లో 42 ఓల్డ్ బిల్డింగ్ తొలగింపు..!!
- అమీర్ కప్ ఫైనల్..మెట్రోలింక్, మెట్రోఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పులు..!!









