ఎఆర్ రెహమాన్ స్టూడియోలో ఇళయరాజా
- March 07, 2022
దుబాయ్: మ్యూజిక్ దిగ్గజాలు ఏఆర్ రెహమాన్, ఇసైజ్ఞాని ఇళయరాజా తాజాగా దుబాయ్లో ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ జంట చాలా మంది సంగీతకారులకు హాట్ ఫేవరెట్ అన్న విషయం తెలిసిందే.దుబాయ్ లో ఉన్న మాస్ట్రో రెహమాన్ స్టూడియో ఫిర్దౌస్ ని ఆదివారం ఇళయరాజా సందర్శించారు.ఎఆర్ రెహమాన్ ట్విట్టర్లో మ్యూజిక్ లెజెండ్తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.“మా ఫిర్దౌస్ స్టూడియోకి మాస్ట్రో ఇళయరాజాను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది… భవిష్యత్తులో మా ఫిర్దౌస్ ఆర్చ్ కోసం ఆయన అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేస్తాడని ఆశిస్తున్నాను!” అంటూ ఆ పిక్ ను షేర్ చేశారు.
ఈ పిక్ వైరల్గా మారింది.త్వరలో ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్ట్ కోసం సహకరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రతిభావంతులైన స్వరకర్తలు ఇద్దరూ దుబాయ్ ఎక్స్పో 2022లో పాల్గొన్నారు. అక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం







