పత్రికలో వచ్చిన వార్త చూసి స్పందించిన ఉపరాష్ట్రపతి
- March 10, 2022
విజయవాడ: ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మరోసారి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.విజయవాడకు చెందిన విధివంచిత కుటుంబానికి తమ జీతం నుంచి లక్షరూపాయల ఆర్థిక సాయం అందించారు.రోజూ దినపత్రికలు చదవడంలో భాగంగా, విజయవాడ దినపత్రికలో వచ్చిన చిన్న వార్త ఆయన్ను కదిలించింది.
విజయవాడకు చెందిన చింతా కుమారి, శివప్రసాద్ లు ప్రేమించి మతాంతర వివాహం చేసుకున్నారు.ఎలక్ట్రిషియన్ గా భర్త సంపాదనతో హాయిగా సాగుతున్న వారి జీవితంలో కష్టాలు ప్రవేశించాయి.శివప్రసాద్ పిట్టగోడ మీద కూర్చుని ఉండగా, ఆ గోడ హఠాత్తుగా పడిపోవడం వల్ల ఆయన వెన్ను దెబ్బతింది. భర్త భారంతో పాటు, పిల్లల భారాన్ని మోస్తున్న ఆమె గురించి పత్రికలో వచ్చిన వార్తను చూసిన ఉపరాష్ట్రపతి వెంటనే వివరాలు కనుక్కోవలసిందిగా సహాయకులను ఆదేశించారు.
వివరాలు తెలిసిన వెంటనే ముందుగా ఆయన జీతం నుంచి లక్షరూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు.భర్తకు అమ్మలా మారి, పిల్లలకు ఆదరువుగా ఆమె నిలబడిన విధానం ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకమంటూ ఆయన అభినందించారు.ఎన్ని కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా, కుమారిలా జీవితంలో నిలబడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
పత్రికలో వచ్చిన చిన్న వార్తకు స్పందించి తమకు వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించిన ఉపరాష్ట్రపతి ఔదార్యానికి చింతా కుమారి,శివప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్







