మద్య రహిత రాష్ర్టంగా బీహార్‌...

- April 01, 2016 , by Maagulf
మద్య రహిత రాష్ర్టంగా బీహార్‌...

 బీహార్ మద్య రహిత రాష్ర్టంగా కాబోతుంది. బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నితీష్ కుమార్ ఏప్రిల్ 1 నుంచి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో నేటి నుంచి బీహార్‌లో మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. పూర్తి స్థాయిలో కాకుండా పాక్షికంగా మద్య నిషేధం అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దేశీయంగా ఉత్పత్తవుతున్న మద్యంతో పాటూ, స్పైస్ లిక్కర్ ను కూడా నిషేధించారు. దీంతో బీహార్ వ్యాప్తంగా 13 లక్షల మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ప్రభుత్వ హెచ్చరికను లెక్కచేయకుండా మద్యం అమ్మకాలు చేపడితే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com