చార్మినార్ ను మరింత సుందరంగా : కేటీఆర్
- April 01, 2016
హైదరాబాద్ నగరానికి గర్వకారణమైన చార్మినార్ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఇవాళ పాతబస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాల్లో 35 కోట్లతో చేపట్టిన పాదచారుల ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చార్మినార్ పరిసర ప్రాంతాలను కేటీఆర్ తోపాటు మేయర్, డిప్యూటీ మేయర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ పరిశీలించారు. అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పాషాఖాద్రీకి ఇచ్చిన మాట ప్రకారం. చార్మినార్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఆరునెలల్లో పెడస్ట్రియన్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







