IPLలో కొత్త రూల్స్ ప్రకటించిన బీసీసీఐ
- March 15, 2022
మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్లో బీసీసీఐ కొన్ని నిబంధనలను కొత్తగా చేర్చింది. కోవిడ్, డీఆర్ఎస్, స్ట్రైకింగ్ వంటి విషయాల్లో అమలు చేయాల్సిన కొన్ని విషయాలను ప్రకటించింది.
అవేంటంటే..
1. జట్టులోని 12 మంది ప్లేయర్లలో కరోనా సోకి మ్యాచ్కు అందుబాటులో లేనప్పుడు ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయవచ్చు. రీషెడ్యూల్ సాధ్యం కాకపోతే ఐపీఎల్ టెక్నికల్ టీం ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
2. ప్రతీ ఇన్నింగ్స్లో రెండు రివ్యూలు కోరేందుకు అనుమతి. ఇంతకు ముందు ఒక్క రివ్యూకే అవకాశం ఉండేది.
3. ఎవరైనా బ్యాటర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ తీసుకోవాలి. ఈ నిబంధనను ఇటీవల మెల్బోర్న్ క్రికెట్ క్లబ్లో అమలు చేశారు.
4. ప్లే ఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచుల్లో టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో లీగ్ స్టేజ్లో టాప్ పాయింట్లు ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!







