చైనాను వణికిస్తున్న స్టెల్త్ ఒమిక్రాన్ వేరియంట్
- March 16, 2022
కరోనా ముప్పు నుంచి కోలుకుంటున్న ప్రపంచ దేశాల్లో మళ్లీ అలజడి రేగింది. చైనాలో కొత్త వేరియంట్ స్టెల్త్ ఒమిక్రాన్దడ పుట్టిస్తోంది. ఒక్కరోజే అత్యధికంగా 5వేల 280 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా ఈశాన్య చైనాలోని జిలిన్ప్రావిన్స్లోనే వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటంతో 13 పెద్ద నగరాలను మూసివేసింది చైనా. దీంతో 3 కోట్ల మందికి పైగా ప్రజలు లాక్డౌన్లోకి వెళ్లారు. చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజా రవాణాను నిలిపివేశారు. జిలిన్, చాంగ్చున్, షెన్ ఝెన్, షాంఘై, లాంగ్ఫాంగ్ వంటి నగరాల్లో ఆంక్షలు విధించారు. ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీజింగ్లోనూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ నగరంతో పాటు, షాంఘైకి రాకపోకలు సాగించే విమానాలను రద్దు చేశారు.
వేగంగా వ్యాపస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దక్షిణకొరియా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే 3లక్షల 62వేల 283 కేసులు నమోదు కాగా, 293 మంది చనిపోయారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణకొరియాలో అత్యధిక మరణాలు నమోదవడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించారు. మరో 11వందల 96 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. దక్షిణకొరియాలో మొత్తం కేసుల సంఖ్య 72 లక్షలకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆందోళనకరమేనన్నారు.
ఈ ఏడాది జూన్ ఆఖరులో నాలుగో వేవ్ ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ నాటికి తగ్గిపోతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపించినా.. దాని తీవ్రత తక్కుగానే ఉందన్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు స్వల్ప లక్షణాలతో త్వరగా కోలుకుంటున్నారన్నారు.
తాజా వార్తలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు







