అబుదాబిలో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్
- March 18, 2022
యూఏఈ: ఎమిరేట్లో కొత్త కొవిడ్-19 గైడ్ లైన్స్ మార్చి 17 నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని టూరిస్టులు దేశంలోకి స్వేచ్ఛగా రావచ్చు. అయితే వచ్చిన 48 గంటల్లో వారు పీసీఆర్ పరీక్ష చేయించుకొని నెగిటివ్ ఫలితాన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(NCEMA) ప్రకటించింది. NCEMA అధికారిక ప్రతినిధి డాక్టర్ తాహెర్ అల్ అమిరి మాట్లాడుతూ.. దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోందని, ఈ క్రమంలో కొన్ని సడలింపులు ఇచ్చామన్నారు. COVID-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోని అన్ని వర్గాలు వ్యూహాత్మక వ్యవహారించాయన్నారు. అబుదాబి అమలు చేసిన వైరస్ కట్టడి విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









