అబుధాబి బిగ్ టికెట్ డ్రా లో భారతీయుడికి జాక్పాట్..!
- March 19, 2022
అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ డ్రాలో భారతీయుడికి జాక్పాట్ తగిలింది. ఖతార్లో ఉండే భారత ప్రవాసుడు షంసీర్ పురక్కల్ అబుధాబిలో తాజాగా నిర్వహించిన వీక్లీ ఎలక్ట్రానిక్ డ్రాలో ఏకంగా 3లక్షల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఖతార్ ఉంటున్న షంసీర్ 2017లో యూఏఈలో ఉన్నప్పటి నుంచి అబుధాబి బిగ్టికెట్ రాఫెల్ పాల్గొంటున్నట్లు తెలిపాడు.2022 తనకు బాగా కలిసొచ్చిందని చెప్పిన అతడు.. ఏడాది క్రితం తనకు వివాహమైందని, ఇప్పుడు తన భార్య మూడు నెలల ప్రగ్నెంట్ అని చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు భారీ మొత్తం గెలుచుకోవడంతో 2022 ఏడాది తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని మురిసిపోతున్నాడు.ఇక తాను గెలుచుకున్న భారీ మొత్తంలో కొంత భాగాన్ని తన ఎంబీఏ కోర్సును పూర్తి చేసుకోవడానికి ఉపయోగించనున్నట్లు పేర్కొన్నాడు.అటు ఏప్రిల్ 3న బిగ్ టికెట్ వారు తీయనున్న 15 మిలియన్ల దిర్హమ్స్ బిగ్మనీ డ్రా కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఇందులో కూడా తనకు అదృష్టం కలిసి వస్తుందని షంసీర్ ఆశాభావంతో ఉన్నాడు.
తాజా వార్తలు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..







