కేజీఎఫ్ - 2 ట్రైలర్ విడుదల
- March 27, 2022
హైదరాబాద్:యశ్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కన్నడ సినిమా ‘కేజీఎఫ్’ ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి పాన్ ఇండియా వైడ్ భారీ విజయం సాధించి, భారీ కలెక్షన్స్ ని రాబట్టింది.ఈ ఒక్క సినిమాతో కన్నడ సినీ పరిశ్రమ తలరాత మారిపోయింది.ఈ సినిమా 2018లో రిలీజ్ అయింది.సినిమా రిలీజ్ అయి మూడేళ్లు పైనే అవుతున్నా సినిమాలో ఉండే ఎలివేషన్స్ గురించి ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు అంటే ఇది ఏ రేంజ్ లో విజయం సాధించిందో అర్ధం చేసుకోవచ్చు. ‘కేజీఎఫ్’ రిలీజ్ అయిన తర్వాత దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు.
దీంతో ‘కేజీఎఫ్ 2’ కోసం మూడు సంవత్సరాలుగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ‘కేజీఎఫ్ 2’ని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇక దీనికి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు చిత్ర యూనిట్. ఇవాళ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ ని కొద్దీ సేపటి క్రితమే విడుదల చేశారు. తెలుగులో ఈ ట్రైలర్ ని రామ్ చరణ్ విడుదల చేశారు. ఇక బెంగుళూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. ఈ ట్రైలర్ లాంచ్ ని బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేయడం విశేషం. కన్నడలో ఈ సినిమా ట్రైలర్ ని శివరాజ్ కుమార్ విడుదల చేశారు.
ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ‘కేజీఎఫ్ చాప్టర్ 1’ కి కంటిన్యూగా ఈ సినిమా సాగనుంది.ఇక ట్రైలర్ లో భారీ యాక్షన్ సీన్స్ చూపించారు. వైలెన్స్.. వైలెన్స్.. అంటూ యశ్ అదరగొట్టాడు.సంజయ్ దత్ అధీరా పాత్రలో మైమరిపించాడు.ఇందిరా గాంధీ పాత్ర కూడా ఎక్కువ నిడివి ఉండబోతున్నట్టు తెలుస్తుంది.ట్రైలర్ లో యాక్షన్ షాట్స్ చాలా చూపించారు. కష్టంతో రాసిన కథ ఇది, సిరాతో ముందుకు తీసుకెళ్లలేం అంటూ ప్రకాష్ రాజ్ స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు, చివర్లో చిన్నప్పటి యశ్ వాళ్ళ అమ్మకి ప్రపంచంలోని బంగారం అంతా నీకు ఇస్తా అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది.
ట్రైలర్ రిలీజ్ అయినా కొన్ని నిమిషాల్లోనే తెలుగులోనే మిలియన్ వ్యూస్ దాటేసింది. కొద్దీ సేపటికే ట్రెండింగ్ లోకి వెళ్ళింది. గతంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ టీజర్ 200 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మరి ఈ ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక ట్రైలర్ రాకతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్డులో గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు
- రోడ్డు ప్రమాద బాధితులకు దుబాయ్ పోలీసుల మానవతా అండ..
- దుబాయ్ తొలి తెలుగు కాన్సుల్ జనరల్తో సందీప్ మక్తాల బృందం భేటీ
- జె.సి.బోస్ గ్రాంట్ మూడోసారి అందుకున్న ప్రొఫెసర్ వి.రామ్గోపాల్ రావు
- కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1 కోటి బీమా చెక్కు అందజేసిన డీజీపీ సి.వి.ఆనంద్
- 'మన అమరావతి' థీమ్తో స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026
- యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- ఎంపీ బాలశౌరి ప్రశ్న పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం
- డల్లాస్లో ఘనంగా ఎస్. జానకి సంగీత నివాళి కార్యక్రమం







