యూఏఈ సంస్కృతిని అవమానించే కంటెంట్ పై కఠిన చర్యలు..
- August 03, 2026
అబుదాబి: సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం (లైవ్ బ్రాడ్కాస్ట్) సందర్భంగా యూఏఈ సంస్కృతి, సామాజిక విలువలను అవమానించే కంటెంట్ను ప్రచారం చేసిన ఇద్దరు వ్యక్తులపై యూఏఈ నేషనల్ మీడియా అథారిటీ (NMA) చట్టపరమైన చర్యలు తీసుకుంది.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఇద్దరు వ్యక్తులు లైవ్ ప్రసారంలో యూఏఈ సంస్కృతి, నాగరిక వారసత్వం, జాతీయ గుర్తింపును అవమానించేలా కంటెంట్ను ప్రసారం చేసినట్లు గుర్తించినట్లు ఎన్ఎంఏ తెలిపింది. అంతేకాకుండా, ఆ కంటెంట్ సమాజంలో నెలకొన్న విలువలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది.
ఈ ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు ప్రారంభించడమే కాకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారిలో ఒకరికి జారీ చేసిన పబ్లిసిటీ పర్మిట్ను మూడు నెలల పాటు సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా నేషనల్ మీడియా అథారిటీ స్పష్టం చేస్తూ, సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ వేదికలను కేవలం ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు లేదా ఎంగేజ్మెంట్ కోసం సమాజ విలువలను దెబ్బతీసేలా ఉపయోగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది.
అలాగే సమాజంలో వివాదాలు సృష్టించే, యూఏఈ జాతీయ గుర్తింపు, విలువలు, సంప్రదాయాలను దెబ్బతీసే కంటెంట్పై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎన్ఎంఏ పేర్కొంది.
డిజిటల్ వేదికలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దేశ చట్టాలు, సామాజిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలను గౌరవిస్తూ కంటెంట్ను ప్రచురించాలని నేషనల్ మీడియా అథారిటీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్పాట్ డాక్టర్పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం







