హైదరాబాద్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు
- March 30, 2022
హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి యాదాద్రి దర్శిని పేరుతో ప్రత్యేక మినీ బస్సులను ఏర్పాటు చేశారు. మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం, హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుండి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జెబిఎస్ నుండి 100 రూపాయలు, ఉప్పల్ నుండి 75 రూపాయలు ఛార్జీ ఉంటుందని వెల్లడించారు.
ప్రతి రోజు 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఇవే కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలకంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సుఖవంతంగా ఉంటుందని చెప్పారు. కొంత మంది ఉద్యోగులు వీఆర్ఎస్ కోరుకుంటున్నారని తెలిపారు.
బలవంతంగా తాము వీఆర్ఎస్ ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. మొన్న ఫీల్డ్ విసిట్ చేసినప్పుడు 2000 మంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్నారని తెలిపారు. అందుకే వారు వాలంటరీ రిటైర్డ్ కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎంత మంది వస్తారో చూసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు ఇవి సెస్ చార్జీలు మాత్రమేనని తెలిపారు. టోల్ ప్లాజా డబ్బులు టిఎస్ ఆర్టీసీ చెల్లిస్తుందన్నారు. ఏటా రూ.70 నుండి 100 కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోతుందని తెలిపారు. ఆర్టీసీ లాభాల కోసమే చార్జీల పెంపు అని స్పష్టం చేశారు. ఇంత చేసినా రోజూ 6 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు. కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









