వివిధ ఆరోగ్య సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మీడియా ముందుకు రావాలి: ఉపరాష్ట్రపతి
- March 30, 2022
న్యూఢిల్లీ: సమాజంలోని వివిధ అంశాలపై వారిలో చైతన్యం తీసుకొస్తూ ప్రజా ఉద్యమాలు తీసుకురావడంలో మీడియా సంస్థలు కీలకమైన పాత్ర పోషించాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. కరోనానంతర పరిస్థితుల్లో టీకా తీసుకోవాల్సిన అవసరం, ఇప్పటికీ టీకా విషయంలో నెలకొన్న సందిగ్ధత, అనుమానాలను నివృత్తి చేసే లక్ష్యంతో నెట్ వర్క్ 18, ఫెడరల్ బ్యాంక్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘సంజీవని: ఎ జర్నీ’ ఉద్యమాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.ఈ సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీని ఉపరాష్ట్రపతి వీక్షించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీకా తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.వివిధ ఆరోగ్య సమస్యలనుంచి మన ప్రాణాలను కాపాడటంలో టీకాలు పోషించే పాత్ర కీలకమన్నారు. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రజాఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉందని, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వీటిపై చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు.
ప్రభుత్వాలు, ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఉద్యోగులతోపాటు బాధ్యత గల పౌరులందరి సహకారంతోనే భారతదేశం 183 కోట్ల టీకాకరణ పూర్తిచేసుకుందన్న ఉపరాష్ట్రపతి ఇంతవరకు టీకాలు వేసుకోని వారు ఎలాంటి అనుమానాల్లేకుండా టీకాలు తీసుకోవాలన్నారు. ‘జీవితంలో మనమెంత విజయవంతం అవుతాం అనే విషయాన్ని పక్కనపెడితే, మన చుట్టుపక్కల ఉన్నవారిని చైతన్యపరచడంలో ఎంతవరకు మన పాత్ర ఉంటుందనేదే మన జీవితానికి సరైన అర్థాన్నిస్తుంది’ అని ఆయన అన్నారు.
కార్పొరేట్ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు తాము సంపాదించిన దాన్ని సమాజంతో పంచుకోవడానికి, సమాజానికి తిరిగి ఇవ్వడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ఓ చక్కటి అవకాశమని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రజల జీవితాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపించేందుకు ఇదొక మంచి సందర్భమన్నారు. సీఎస్ఆర్ కార్యక్రమాలను సేవా కార్యక్రమాలుగా కాకుండా బాధ్యతగా చూసినప్పుడే దీంట్లో సత్ఫలితాలను చూడగలమన్నారు.
తాజా వార్తలు
- ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- ఒమన్ లో ఇన్వెస్ట్ మెంట్స్.. FSA వార్నింగ్ అలెర్ట్..!!
- ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక.. స్వాగతించిన మిడిలీస్టు, యూరోపియన్..!!
- పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- హ్యుమన్ ట్రాఫికింగ్..అంతర్జాతీయ రోల్ మోడల్గా బహ్రెయిన్..!!
- ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- విప్లవం’ పోస్ట్ తో తమిళనాడులో పెనుదుమారం
- ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఫీజు రూపాయి మాత్రమే
- బాలకృష్ణ–చిరంజీవి వివాదం: 300 కేసుల యోచన రద్దు
- 'తెలుగు తల్లి’ ఫ్లైఓవర్ పేరు ఇకపై 'తెలంగాణ తల్లి'