పెండింగ్ ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ గడువు పొడిగించిన తెలంగాణ పోలీస్
- March 30, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.ఈ మేర గడువు తేదీ మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్ వినిపించారు.రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల చలాన్లను చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి.పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు చెబుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందన, విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజుల పాటు అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు తెలిపారు.ఇప్పటి వరకూ చలాన్లు చెల్లించలేక పోయినవాళ్లు రాయితీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
తాజా వార్తలు
- విజయవాడ హైవే మీద ప్రయాణించే వారికి శుభవార్త
- అక్రమ మందుల అమ్మకాల పై సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొరడా..!!
- ప్రాంతీయ భద్రత పై కింగ్ హమద్, యూకే రక్షణ మంత్రి చర్చలు..!!
- త్వరలోనే భారత్ కు సెల్వం కృష్ణన్ పార్ధివ దేహం..భారత రాయబారి..!!
- హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఇలా గుర్తించండి..గైడ్ లైన్స్ విడుదల చేసిన ఖతార్..!!
- మిడిలీస్టులో యుద్ధ పరిణామాల పై సమావేశం..పాల్గొన్న ఒమన్..!!
- యూఏఈలో ఏప్రిల్ 17 వరకు డిస్టన్స్ లెర్నింగ్ పొడిగింపు..!!
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!









