పెండింగ్ ట్రాఫిక్ చలానాల డిస్కౌంట్ గడువు పొడిగించిన తెలంగాణ పోలీస్
- March 30, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.ఈ మేర గడువు తేదీ మార్చి 31తో ముగియనుండగా మరో గుడ్ న్యూస్ వినిపించారు.రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 40 లక్షల చలాన్లను చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నాయి.పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరినట్లు చెబుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందన, విజ్ఞప్తి మేరకు మరో పదిహేను రోజుల పాటు అంటే ఏప్రిల్ 15వ తేదీ వరకు రాయితీ అవకాశాన్ని పొడిగించినట్లు తెలిపారు.ఇప్పటి వరకూ చలాన్లు చెల్లించలేక పోయినవాళ్లు రాయితీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ-చలాన్ వెబ్సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







