హైదరాబాద్లో రేవ్ పార్టీ భగ్నం.. 150 మంది అరెస్ట్..
- April 03, 2022
హైదరాబాద్: హైదరాబాద్లో లేట్ నైట్ పార్టీ కల్చర్ రోజు రోజుకీ అధికమవుతుంది. తాజాగా సమయం దాటినా జరుగుతున్నా లేట్ నైట్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ హోటల్లో లేట్ నైట్ పార్టీని నిర్వహిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టాస్క్ఫోర్స్ పోలీసులు ఫుడింగ్ మింక్ పబ్పై మెరుపు దాడులు నిర్వహించారు. పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ ఖమ్మం మాజీ ఎంపీ కూతురు గా గుర్తించారు. ఈ పబ్ లో ఆరు గ్రాముల కొకైన్ దొరికింది. ఫుడింగ్ అండ్ మింక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతేకాదు లేట్ పార్టీలో 150 మంది యువతీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు.అదుపులోకి తీసుజున్న వారిలో పబ్ యజమానితో సహా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, టాలీవుడ్ ప్రముఖ హీరో తనయ, సీనియర్ నటుడు కుమార్తె కూడా ఉన్నట్లు సమాచారం.39 మంది యువతులు ఉన్నారని పోలీసులు తెలిపారు.రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ వాడినట్లు తెలుస్తోంది. అయితే 150 మంది లో 145 మందిని పోలీసులు కండిషన్స్ తో వదిలి పెట్టారు. 5 గురిని మాత్రమే పోలీస్ స్టేషన్ లో ఉంచారు.ఇలా పోలీసు అదుపులో ఉన్న వారిలో ప్రముఖ హీరో కూతురు ఉన్నట్లు సమాచారం. ప్రముఖ హీరో, మేనల్లుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు దాడి చేయడంతో డ్రగ్స్ ను బాత్రూంలో, కిటికిలో నుంచి డ్రగ్స్ బయట పడేసినట్లు తెలుస్తోంది. ఫుడింగ్ మింక్ పబ్ బాత్రూంలో దొరికిన కొకైన్ ను టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. అంతేకాదు కిటిలోనుంచి బయటపడిన 12 ప్యాకెట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే పబ్ బంజారాహిల్స్ పీఎస్ కి అతిసమీపంలో ఉంది. దీంతో పోలీసుల నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా రాడిసన్ పబ్ పై గతంలో కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పబ్ మాజీ ఎంపీ కూతురుది కావడం తో చూసి చూడనట్లు బంజారాహిల్స్ పోలీసులు వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి మూడు గంటలు వరకు పబ్ నడిచినా పబ్ పై కన్నెత్తి చూడని బంజారాహిల్స్ పోలీసులు అంటూ ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







