తొలిసారి రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ తరపున భారత్ గళం..
- April 06, 2022
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం చేయటాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వ్యతిరేకించాయి. కానీ భారత్ మాత్రం వ్యతిరేకటచంలేదు..అలాగని సమర్థించటంలేదు. ఎందుకంటే రష్యాతో భారత్ కు ఉన్న సత్సంబంధాలు. కానీ రష్యా యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించి 40 రోజులుపైగా అయ్యాక మొదటిసారిగా భారత్ తీవ్రంగా స్పందించింది. యుక్రెయిన్ లోని బుచా నగరంలోని సాధారణ పౌరుల రష్యా సేతలు అత్యంత దారుణంగా చంపిన ఘటనను తీవ్రంగా ఖండించింది భారత్. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు డిమాండ్ చేసింది. బుచా వీధుల్లో పిట్టల్లా రాలిపోయినట్టున్న పౌరుల మృత దేహాల ఫొటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో భారత్ స్పందించింది.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఈ అంశంపై మాట్లాడారు. ''భద్రతా పరిస్థితులు దిగజారాయని అన్నారు.బుచాలో పౌరుల హత్యలపై వస్తున్న వార్తలు ఎంతో కలతకు గురిచేస్తున్నాయి. దీన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాం. స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిస్తున్నాం'' అని తిరుమూర్తి ప్రకటన చేశారు.
''మానవతా అవసరాల పట్ల అంతర్జాతీయ సమాజం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. కనీస మానవ అవసరాలు, వైద్య సరఫరాలు సజావుగా సాగేందుకు సురక్షిత మార్గాలు తెరవడానికి మేము మద్దతిస్తున్నాం. యుక్రెయిన్ లో ఉన్న దారుణ మానవతా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ దేశానికి, దాని పొరుగు దేశాలకు ఔషధాలు, ఇతర నిత్యావసర సరుకులను పంపిస్తున్నాం. మరింత వైద్య సరఫరాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం'' అని తిరుమూర్తి ప్రకటన చేశారు.
యుద్ధం ఆరంభమైన నాటి నుంచే తాము చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బలంగా చెబుతూ వచ్చామని తిరుమూర్తి గుర్తు చేశారు. అమాయక పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు దౌత్య మార్గం ఒక్కటే ఆచరణీయంగా ఉండాలన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









