చేపల కొరత మరికొన్ని రోజులు కొనసాగుతుందని భావిస్తున్నారు

- April 03, 2016 , by Maagulf
చేపల కొరత మరికొన్ని రోజులు కొనసాగుతుందని భావిస్తున్నారు

 చేపలు కొరతతో మరికొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదని  స్థానిక మార్కెట్లో దుకాణ యజమానులు  భావిస్తున్నారు.వాతావరణ పరిస్థితులు మెరుగ్గా ఉండకపోవడంతో  కేవలం తక్కువ మంది మత్స్యకార వర్గాలు మాత్రమె సముద్రంలో చేపల వేటకు వెలుతున్నారని, ఈ కారణంగా చేపలు కొరత కొంతకాలం ఉంటుందని మత్స్య పరిశ్రమ వర్గాలు గల్ఫ్ టైమ్స్ కు  చెప్పారు. వచ్చే 24 గంటల్లో మరిన్ని పడవలు సముద్రంలో చేపల వేటలకు వెళ్ళే  అవకాశముందని వేటకు తగిన  పరిస్థితులు అభివృద్ధి  చెందడంతో మరికొన్ని రోజులలో  చేపలు సులభంగా లభ్యం కావచ్చు.దోహా సెంట్రల్ మార్కెట్లో టోకు వర్తకుల వద్ద  చాలా దుకాణాలలో వద్ద నిల్వలు గత 24 గంటల్లో క్షీణించిపోవడం కారణంగా  గత రెండు రోజులుగా తాజా సరఫరా లేకుండా ఉన్నాయని అన్నారు . ఫలితంగా, ప్రధాన హైపర్ మార్కెట్స్ వద్ద సైతం చేపలకు  పెద్ద కొరత ఏర్పడింది దీంతో అధిక ధరల కారణంగా, రిటైల్ విక్రయ కేంద్రాల్లో చేపల వ్యాపారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి  సెంట్రల్ మార్కెట్ వద్ద విక్రయ కేంద్రాల్లో శనివారం నాడు  చేపల  ప్రధాన మార్కెట్ వద్ద  అత్యంత చవక రకం  కిలో చేప 25 ఖతర్ రియాల్స్ ధరకు విక్రయించారు. కింగ్ చేపల ధరలు 80 ఖతర్ రియాల్స్ మరియు కిలో 83 ఖతర్ రియాల్స్ మధ్య ఉంటుంది వ్యాపారులు తెలిపారు. హమౌర్ రకం చేపనకు  కొద్ది మొత్తంలో అందుబాటులో మరియు  68 ఖతర్ రియాల్స్ మరియు కిలో 70 ఖతర్ రియాల్స్ ధరల్లో  ఉంది. ఆదివారం సౌదీ అరేబియాలో చవక రకం చేపలు  కిలో ధర 10 ఖతర్ రియాల్స్  ధర పలుకుతుంది  ఆదివారం సాయంత్రం చివరిలో  టోకు  వ్యాపారులను సంప్రదించగా, చేపల సరఫరా సరిగా లేదని మరో రెండు లేదా మూడు రోజుల తర్వాత ఈ పరిస్థితి మెరుగుపడుతుందని వారు చెప్పారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com