చేపల కొరత మరికొన్ని రోజులు కొనసాగుతుందని భావిస్తున్నారు
- April 03, 2016
చేపలు కొరతతో మరికొన్ని రోజులు ఇబ్బంది పడక తప్పదని స్థానిక మార్కెట్లో దుకాణ యజమానులు భావిస్తున్నారు.వాతావరణ పరిస్థితులు మెరుగ్గా ఉండకపోవడంతో కేవలం తక్కువ మంది మత్స్యకార వర్గాలు మాత్రమె సముద్రంలో చేపల వేటకు వెలుతున్నారని, ఈ కారణంగా చేపలు కొరత కొంతకాలం ఉంటుందని మత్స్య పరిశ్రమ వర్గాలు గల్ఫ్ టైమ్స్ కు చెప్పారు. వచ్చే 24 గంటల్లో మరిన్ని పడవలు సముద్రంలో చేపల వేటలకు వెళ్ళే అవకాశముందని వేటకు తగిన పరిస్థితులు అభివృద్ధి చెందడంతో మరికొన్ని రోజులలో చేపలు సులభంగా లభ్యం కావచ్చు.దోహా సెంట్రల్ మార్కెట్లో టోకు వర్తకుల వద్ద చాలా దుకాణాలలో వద్ద నిల్వలు గత 24 గంటల్లో క్షీణించిపోవడం కారణంగా గత రెండు రోజులుగా తాజా సరఫరా లేకుండా ఉన్నాయని అన్నారు . ఫలితంగా, ప్రధాన హైపర్ మార్కెట్స్ వద్ద సైతం చేపలకు పెద్ద కొరత ఏర్పడింది దీంతో అధిక ధరల కారణంగా, రిటైల్ విక్రయ కేంద్రాల్లో చేపల వ్యాపారానికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి సెంట్రల్ మార్కెట్ వద్ద విక్రయ కేంద్రాల్లో శనివారం నాడు చేపల ప్రధాన మార్కెట్ వద్ద అత్యంత చవక రకం కిలో చేప 25 ఖతర్ రియాల్స్ ధరకు విక్రయించారు. కింగ్ చేపల ధరలు 80 ఖతర్ రియాల్స్ మరియు కిలో 83 ఖతర్ రియాల్స్ మధ్య ఉంటుంది వ్యాపారులు తెలిపారు. హమౌర్ రకం చేపనకు కొద్ది మొత్తంలో అందుబాటులో మరియు 68 ఖతర్ రియాల్స్ మరియు కిలో 70 ఖతర్ రియాల్స్ ధరల్లో ఉంది. ఆదివారం సౌదీ అరేబియాలో చవక రకం చేపలు కిలో ధర 10 ఖతర్ రియాల్స్ ధర పలుకుతుంది ఆదివారం సాయంత్రం చివరిలో టోకు వ్యాపారులను సంప్రదించగా, చేపల సరఫరా సరిగా లేదని మరో రెండు లేదా మూడు రోజుల తర్వాత ఈ పరిస్థితి మెరుగుపడుతుందని వారు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







