మే 21న కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు
- April 12, 2022
కువైట్: మే 21న కువైట్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు 2022 జరుగనున్నాయి. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలపై డిక్రీని బుధవారం అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారిక గెజిట్లో ప్రచురించనుంది. అభ్యర్థుల నమోదు ఏప్రిల్ 14 నుండి 10 రోజుల పాటు కొనసాగనుంది. ఎన్నికలు మే 21 న జరిపేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేశారు. 10 జిల్లాల్లో రాబోయే ఎన్నికలకు అర్హులైన ఓటర్ల సంఖ్య 602,156 ఉండగా.. ఇందులో 290,239 మంది పురుషులు, 31,917 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థి తప్పనిసరిగా అర్హత కలిగిన ఓటరుగా నమోదు అయి ఉండాలి. అలాగే ఒకటి కంటే ఎక్కువ జిల్లాల్లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేయడానికి ఎన్నికల చట్టం అనుమతించదు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటును వినియోగించుకునేందుకు వీలుగా 660కి పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!