హత్య కేసులో 4 ఆసియా జాతీయులకి ఏడేళ్ళ జైలు శిక్ష
- April 13, 2022
దుబాయ్: ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి, ఓ మహిళను హత్య చేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి సాయం తీసుకున్నాడు హంతకుడు. మృతురాలికీ, హంతకుడి స్నేహితుడికీ మధ్య ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణం. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ కేసులో దోషులకు ఏడేళ్ళ కారాగార శిక్ష విధించింది. వారికి 200,000 దిర్హాముల జరీమానా విధించడంతోపాటు, శిక్షా కాలం ముగిశాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది న్యాయస్థానం. గత ఏడాది ఆగస్టులో ఈ హత్య జరిగింది. అల్ నఖీల్ ప్రాంతంలో ఆసియా జాతీయురాలైన ఓ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 దిర్హాముల గురించి జరిగిన గొడవ హత్యకు దారి తీసింది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







