హత్య కేసులో 4 ఆసియా జాతీయులకి ఏడేళ్ళ జైలు శిక్ష
- April 13, 2022
దుబాయ్: ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి, ఓ మహిళను హత్య చేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి సాయం తీసుకున్నాడు హంతకుడు. మృతురాలికీ, హంతకుడి స్నేహితుడికీ మధ్య ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణం. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ కేసులో దోషులకు ఏడేళ్ళ కారాగార శిక్ష విధించింది. వారికి 200,000 దిర్హాముల జరీమానా విధించడంతోపాటు, శిక్షా కాలం ముగిశాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది న్యాయస్థానం. గత ఏడాది ఆగస్టులో ఈ హత్య జరిగింది. అల్ నఖీల్ ప్రాంతంలో ఆసియా జాతీయురాలైన ఓ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 దిర్హాముల గురించి జరిగిన గొడవ హత్యకు దారి తీసింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







