హత్య కేసులో 4 ఆసియా జాతీయులకి ఏడేళ్ళ జైలు శిక్ష
- April 13, 2022
దుబాయ్: ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి, ఓ మహిళను హత్య చేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురి సాయం తీసుకున్నాడు హంతకుడు. మృతురాలికీ, హంతకుడి స్నేహితుడికీ మధ్య ఆర్థిక వివాదమే ఈ హత్యకు కారణం. దుబాయ్ క్రిమినల్ కోర్టు ఈ కేసులో దోషులకు ఏడేళ్ళ కారాగార శిక్ష విధించింది. వారికి 200,000 దిర్హాముల జరీమానా విధించడంతోపాటు, శిక్షా కాలం ముగిశాక వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది న్యాయస్థానం. గత ఏడాది ఆగస్టులో ఈ హత్య జరిగింది. అల్ నఖీల్ ప్రాంతంలో ఆసియా జాతీయురాలైన ఓ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 200 దిర్హాముల గురించి జరిగిన గొడవ హత్యకు దారి తీసింది.
తాజా వార్తలు
- తానా ఆధ్వర్యంలో 'ప్రతిభామూర్తులు' సభ విజయవంతం
- మైటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ట్రోఫీని హోటల్ గదికి తీసుకుకెళ్లిన పీసీబీ
- టీమిండియా విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
- అమరావతిలో 12 బ్యాంకుల హెడ్ ఆఫీసులు..
- తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!