సిట్రా పోర్టులో అగ్నికి ఆముతైన బోటు: బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ విచారణ
- April 13, 2022
బహ్రెయిన్: పబ్లిక్ ప్రాసిక్యూషన్, సిట్రా పోర్టులో బోటు అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే కోస్టు గార్డు డిపార్టుమెంటుకి సమాచారమిచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్కి సమాచారం అందినట్లు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 79 ఏళ్ళ వృద్ధురాలు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆ బోటులోనే వీరంతా వున్నారు. ఇంధన ట్యాంకు నుంచి ఇంధనం లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. స్థానిక పోలీసులు, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు అలాగే సివిల్ డిఫెన్స్ అధికారుల నుంచి సమాచారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







