సిట్రా పోర్టులో అగ్నికి ఆముతైన బోటు: బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ విచారణ

- April 13, 2022 , by Maagulf
సిట్రా పోర్టులో అగ్నికి ఆముతైన బోటు: బహ్రెయిన్ ప్రాసిక్యూషన్ విచారణ

బహ్రెయిన్: పబ్లిక్ ప్రాసిక్యూషన్, సిట్రా పోర్టులో బోటు అగ్నికి ఆహుతైన ఘటనకు సంబంధించి విచారణ ప్రారంభించింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోగానే కోస్టు గార్డు డిపార్టుమెంటుకి సమాచారమిచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి సమాచారం అందినట్లు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. ఈ ఘటనలో 79 ఏళ్ళ వృద్ధురాలు మృతి చెందగా, ఏడుగురు గాయాలపాలయ్యారు. అగ్ని ప్రమాదం సమయంలో ఆ బోటులోనే వీరంతా వున్నారు. ఇంధన ట్యాంకు నుంచి ఇంధనం లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. స్థానిక పోలీసులు, సాంకేతిక నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు అలాగే సివిల్ డిఫెన్స్ అధికారుల నుంచి సమాచారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదురుచూస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com