పుట్టగొడుగులు తిని 13 మంది మృతి
- April 13, 2022
అసోం: అసోంలో విషాద ఘటన చోటుచేసుకుంది.అడవిలో దొరికే విషపూరితమైన పుట్టగొడుగులు తిని 13 మంది చనిపోయారు.మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ ఘటనలో మృత్యువాత పడ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు.రాష్ట్రంలో ఎగువ జిల్లాలైన చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, టిన్సుకియా ప్రాంతాల్లో పుట్టగొడుగులు తిన్న వ్యక్తులు అస్వస్థతకు గురైనట్లు అసోం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత డిహింగియా తెలిపారు. ఐదు రోజుల్లో 35 మంది ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
35 మందిలో 13 మంది చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.అందులో నలుగురు సోమవారం, తొమ్మిదిమంది మంగళవారం చనిపోయారని తెలిపారు.మృతి చెందిన వారిలో చరైడియా జిల్లాలోని సోనారి ప్రాంతానికి చెందిన చిన్నారి కూడా ఉంది.అలాగే దిబ్రూఘర్ జిల్లాలో బార్బరువా ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉన్నారు. అదేవిధంగా శివసాగర్ జిల్లాలకు చెందిన వ్యక్తి ఒకరున్నారు అని తెలిపారు. వీరంతా కూడా అడవిలో దొరికే విషపూరితమైన పుట్ట గొడుగులను తినడం వల్ల ఇలా జరిగిందని, వాటిని తిన్నాక అందరిలో కడుపునొప్పి, వాంతులు, వికారం మొదలై ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా అలెగ్జాండర్ జ్వెరెవ్..
- మాస్కోలో రష్యా రేర్ ఎర్త్ సంస్థ ‘గిరెడ్మెట్’ ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ
- దుబాయ్ హార్బర్కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి









