పుట్టగొడుగులు తిని 13 మంది మృతి
- April 13, 2022
అసోం: అసోంలో విషాద ఘటన చోటుచేసుకుంది.అడవిలో దొరికే విషపూరితమైన పుట్టగొడుగులు తిని 13 మంది చనిపోయారు.మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 39 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఈ ఘటనలో మృత్యువాత పడ్డ వారంతా తేయాకు కార్మికులుగా అధికారులు గుర్తించారు.రాష్ట్రంలో ఎగువ జిల్లాలైన చరైడియో, దిబ్రూఘర్, శివసాగర్, టిన్సుకియా ప్రాంతాల్లో పుట్టగొడుగులు తిన్న వ్యక్తులు అస్వస్థతకు గురైనట్లు అసోం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత డిహింగియా తెలిపారు. ఐదు రోజుల్లో 35 మంది ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
35 మందిలో 13 మంది చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.అందులో నలుగురు సోమవారం, తొమ్మిదిమంది మంగళవారం చనిపోయారని తెలిపారు.మృతి చెందిన వారిలో చరైడియా జిల్లాలోని సోనారి ప్రాంతానికి చెందిన చిన్నారి కూడా ఉంది.అలాగే దిబ్రూఘర్ జిల్లాలో బార్బరువా ప్రాంతానికి చెందిన ఐదుగురు ఉన్నారు. అదేవిధంగా శివసాగర్ జిల్లాలకు చెందిన వ్యక్తి ఒకరున్నారు అని తెలిపారు. వీరంతా కూడా అడవిలో దొరికే విషపూరితమైన పుట్ట గొడుగులను తినడం వల్ల ఇలా జరిగిందని, వాటిని తిన్నాక అందరిలో కడుపునొప్పి, వాంతులు, వికారం మొదలై ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







