మే 4, 5న తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..పీసీసీ నేతలతో భేటీ
- April 14, 2022
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. మే నెల 4న తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ..రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. మే 4న వరంగల్లో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఆ తర్వాతి రోజున…మే 5న బోయిన్పల్లిలో పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లుగా టీపీసీసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్ శుక్రవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పీసీసీ కార్యవర్గంతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయన సమీక్షించనున్నారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









