యూఏఈ: భిక్షాటన చేయించినా, చేసినా..Dh100,000 జరిమానా.. 6నెలల జైలు!
- April 15, 2022అబుధాబి:యూఏఈ ప్రభుత్వం భిక్షాటన విషయమై తాజాగా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశంలో ఎవరైనా బయటి దేశాల వారిని నియమించుకుని(ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని) భిక్షాటన చేయిస్తే 100,000 దిర్హాములు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గురువారం వెల్లడించింది.అలాగే భిక్షాటన చేసిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 477 ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో దేశంలో భిక్షాటన చేసే వారి పై యూఏఈ ప్రభుత్వం ప్రతియేటా ఉక్కుపాదం మోపుతోంది.ఈ క్రమంలోనే ఇటీవల భారీ సంఖ్యలో బిచ్చగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!