యూఏఈ: భిక్షాటన చేయించినా, చేసినా..Dh100,000 జరిమానా.. 6నెలల జైలు!
- April 15, 2022అబుధాబి:యూఏఈ ప్రభుత్వం భిక్షాటన విషయమై తాజాగా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశంలో ఎవరైనా బయటి దేశాల వారిని నియమించుకుని(ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని) భిక్షాటన చేయిస్తే 100,000 దిర్హాములు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గురువారం వెల్లడించింది.అలాగే భిక్షాటన చేసిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 477 ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో దేశంలో భిక్షాటన చేసే వారి పై యూఏఈ ప్రభుత్వం ప్రతియేటా ఉక్కుపాదం మోపుతోంది.ఈ క్రమంలోనే ఇటీవల భారీ సంఖ్యలో బిచ్చగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్కు మరో దౌత్య విజయం