రామోజీ ఇంట కల్యాణం.. ఘనంగా బృహతి- అక్షయ్ పరియణ వేడుక..
- April 16, 2022
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఘనంగా జరుగుతోంది.దండమూడి అమర్ మోహన్దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్.. ఈనాడు ఎండీ సీహెచ్. కిరణ్, శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి శనివారం రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్సిటీకి విచ్చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్రావు, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్కుమార్, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ ప్రముఖులు మోహన్బాబు, మురళీమోహన్, దర్శకుడు రాజమౌళి, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్, సాయికుమార్, రాజేంద్రప్రసాద్, శ్యామ్ప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









