రామోజీ ఇంట కల్యాణం.. ఘనంగా బృహతి- అక్షయ్ పరియణ వేడుక..
- April 16, 2022
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఘనంగా జరుగుతోంది.దండమూడి అమర్ మోహన్దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్.. ఈనాడు ఎండీ సీహెచ్. కిరణ్, శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి శనివారం రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్సిటీకి విచ్చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్రావు, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్కుమార్, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ ప్రముఖులు మోహన్బాబు, మురళీమోహన్, దర్శకుడు రాజమౌళి, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్, సాయికుమార్, రాజేంద్రప్రసాద్, శ్యామ్ప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







