రామోజీ ఇంట కల్యాణం.. ఘనంగా బృహతి- అక్షయ్ పరియణ వేడుక..
- April 16, 2022
హైదరాబాద్: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మనవరాలు బృహతి పరిణయ వేడుక రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా ఘనంగా జరుగుతోంది.దండమూడి అమర్ మోహన్దాస్, అనితల కుమారుడు వెంకట్ అక్షయ్.. ఈనాడు ఎండీ సీహెచ్. కిరణ్, శైలజ దంపతుల ద్వితీయ కుమార్తె బృహతి శనివారం రాత్రి 12 గంటల 18 నిమిషాల శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటికానున్నారు.ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రామోజీ ఫిల్మ్సిటీకి విచ్చేశారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, అగ్ర కథానాయకులు రజనీకాంత్, చిరంజీవి విచ్చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.వీరితో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి హరీశ్రావు, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, సంతోష్కుమార్, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, సినీ ప్రముఖులు మోహన్బాబు, మురళీమోహన్, దర్శకుడు రాజమౌళి, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, అశ్వనీదత్, సాయికుమార్, రాజేంద్రప్రసాద్, శ్యామ్ప్రసాద్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









