'నా ఐరోపా యాత్ర' అంటున్న దుబాయ్ వాసి

- April 04, 2016 , by Maagulf

యాత్రా దర్శినిలో జీవితం కనిపించాలని శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాజేష్ వేమూరి రచించిన 'నా ఐరోపా యాత్ర' పుస్తకావిష్కరణ సభ ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పుస్తకాన్ని మండలి ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. యాత్ర చరిత్ర ఆయా ప్రాంతాల జనజీవితం, భాష, సంస్కృతి అధ్యయనం చేయటానికి దోహదపడుతుంది అని అన్నారు. యాత్రా చరిత్రలు తెలుగు భాషలో అరుదుగా కనిపిస్తాయని, ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణ చందు మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యాన్ని ఇస్తాయన్నారు. ది కల్చరల్ సెంటర్ సీయీఓ శివ నాగిరెడ్డి మాట్లాడుతూ చాలా మంది ప్రముఖుల జీవితాలు యాత్ర దర్శనాల్లో  కనిపిస్తాయన్నారు. వేమూరి రాజేష్ ఐరోపా దేశంలోని అనేక ప్రాంతాలు దర్శించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, సాంఘిక అంశాలను 'నా ఐరోపా యాత్ర' ద్వారా వివరించారని కొనియాడారు. రచయిత రాజేష్ వేమూరి తన యాత్రానుభవాలను నలుగురికీ అందించాలన్న ఉద్దేశ్యంతో పుస్తకాన్ని రాశానని పేర్కొన్నారు. రచయిత్రి రేజీనా తదితరులు పాల్గొనారు.

ఈ పుస్తకం కేవలం 20 దిర్హమ్స్ మాత్రమే, కావాల్సిన వారు మాగల్ఫ్.కామ్ టీం మొబైల్ నం#0556939320 కి కాల్ చెయ్యగలరు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com