'నా ఐరోపా యాత్ర' అంటున్న దుబాయ్ వాసి
- April 04, 2016
యాత్రా దర్శినిలో జీవితం కనిపించాలని శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాజేష్ వేమూరి రచించిన 'నా ఐరోపా యాత్ర' పుస్తకావిష్కరణ సభ ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ పుస్తకాన్ని మండలి ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. యాత్ర చరిత్ర ఆయా ప్రాంతాల జనజీవితం, భాష, సంస్కృతి అధ్యయనం చేయటానికి దోహదపడుతుంది అని అన్నారు. యాత్రా చరిత్రలు తెలుగు భాషలో అరుదుగా కనిపిస్తాయని, ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణ చందు మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యాన్ని ఇస్తాయన్నారు. ది కల్చరల్ సెంటర్ సీయీఓ శివ నాగిరెడ్డి మాట్లాడుతూ చాలా మంది ప్రముఖుల జీవితాలు యాత్ర దర్శనాల్లో కనిపిస్తాయన్నారు. వేమూరి రాజేష్ ఐరోపా దేశంలోని అనేక ప్రాంతాలు దర్శించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, సాంఘిక అంశాలను 'నా ఐరోపా యాత్ర' ద్వారా వివరించారని కొనియాడారు. రచయిత రాజేష్ వేమూరి తన యాత్రానుభవాలను నలుగురికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాశానని పేర్కొన్నారు. రచయిత్రి రేజీనా తదితరులు పాల్గొనారు.
ఈ పుస్తకం కేవలం 20 దిర్హమ్స్ మాత్రమే, కావాల్సిన వారు మాగల్ఫ్.కామ్ టీం మొబైల్ నం#0556939320 కి కాల్ చెయ్యగలరు.

తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







