'నా ఐరోపా యాత్ర' అంటున్న దుబాయ్ వాసి
- April 04, 2016
యాత్రా దర్శినిలో జీవితం కనిపించాలని శాసన సభ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. రాజేష్ వేమూరి రచించిన 'నా ఐరోపా యాత్ర' పుస్తకావిష్కరణ సభ ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో హోటల్ ఐలాపురంలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ పుస్తకాన్ని మండలి ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. యాత్ర చరిత్ర ఆయా ప్రాంతాల జనజీవితం, భాష, సంస్కృతి అధ్యయనం చేయటానికి దోహదపడుతుంది అని అన్నారు. యాత్రా చరిత్రలు తెలుగు భాషలో అరుదుగా కనిపిస్తాయని, ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జి.వి.పూర్ణ చందు మాట్లాడుతూ పుస్తకాలు మనిషికి ఆత్మ విశ్వాసం, మానసిక ధైర్యాన్ని ఇస్తాయన్నారు. ది కల్చరల్ సెంటర్ సీయీఓ శివ నాగిరెడ్డి మాట్లాడుతూ చాలా మంది ప్రముఖుల జీవితాలు యాత్ర దర్శనాల్లో కనిపిస్తాయన్నారు. వేమూరి రాజేష్ ఐరోపా దేశంలోని అనేక ప్రాంతాలు దర్శించి అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు, సాంఘిక అంశాలను 'నా ఐరోపా యాత్ర' ద్వారా వివరించారని కొనియాడారు. రచయిత రాజేష్ వేమూరి తన యాత్రానుభవాలను నలుగురికీ అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకాన్ని రాశానని పేర్కొన్నారు. రచయిత్రి రేజీనా తదితరులు పాల్గొనారు.
ఈ పుస్తకం కేవలం 20 దిర్హమ్స్ మాత్రమే, కావాల్సిన వారు మాగల్ఫ్.కామ్ టీం మొబైల్ నం#0556939320 కి కాల్ చెయ్యగలరు.

తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









