స్మార్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్ట్‌: అదనపు ఛార్జీలకు చెల్లుచీటీ

- April 04, 2016 , by Maagulf
స్మార్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ కార్ట్‌: అదనపు ఛార్జీలకు చెల్లుచీటీ

స్కూల్‌ విద్యార్థుల్ని రవాణా చేయడానికి మినీ బస్సులను ఉపయోగించడాన్ని ఖతార్‌లో బ్యాన్‌ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అన్ని స్కూల్‌ బస్సుల్లోనూ ఎలక్ట్రానిక్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ని జీపీఎస్‌తో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ కూడా ఉంది. పేరెంట్స్‌ ఈ అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలపై తమ పిల్లల భద్రతా చర్యలకు సంబంధించి ఒత్తిడి తీసుకురావాలని ట్రాఫిక్‌ సేఫ్టీ ఎక్స్‌పర్ట్‌ సూచించారు. మార్చ్‌ 17న ఓ స్కూల్‌ బస్సు ప్రమాదానికి గురవడం, ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడంతో భద్రతా చర్యల విషయంలో రాజీ పడరాదని పేరెంట్స్‌కి హెచ్చరికలు అందుతున్నాయి. బస్సులకి స్పీడ్‌ గవర్నర్స్‌ కూడా ఉండాలనేది ఇంకో ముఖ్యమైన డిమాండ్‌. స్కూలు పిల్లల్ని తరలించే బస్సుల్లో పిల్లల సంఖ్యకి తగ్గట్టుగా అటెండెంట్లు ఉండాలి. స్కూలు బస్సుల వేగం 80 కిలోమీటర్లకు మించరాదు. అలాగే, బస్సు డ్రైవర్లు సుశిక్షితులై ఉండాలి. ఈ అంశాలపై స్కూలు యాజమాన్యాన్ని పేరెంట్స్‌ ప్రశ్నించగలిగితే, స్కూలు పిల్లలు భద్రంగా ఇంటికి తిరిగొస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com