పేరెంట్స్.. స్కూలు బస్సులతో జాగ్రత్త
- April 04, 2016
స్కూల్ విద్యార్థుల్ని రవాణా చేయడానికి మినీ బస్సులను ఉపయోగించడాన్ని ఖతార్లో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. అన్ని స్కూల్ బస్సుల్లోనూ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్ని జీపీఎస్తో ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా ఉంది. పేరెంట్స్ ఈ అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని, పాఠశాలలపై తమ పిల్లల భద్రతా చర్యలకు సంబంధించి ఒత్తిడి తీసుకురావాలని ట్రాఫిక్ సేఫ్టీ ఎక్స్పర్ట్ సూచించారు. మార్చ్ 17న ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడం, ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడంతో భద్రతా చర్యల విషయంలో రాజీ పడరాదని పేరెంట్స్కి హెచ్చరికలు అందుతున్నాయి. బస్సులకి స్పీడ్ గవర్నర్స్ కూడా ఉండాలనేది ఇంకో ముఖ్యమైన డిమాండ్. స్కూలు పిల్లల్ని తరలించే బస్సుల్లో పిల్లల సంఖ్యకి తగ్గట్టుగా అటెండెంట్లు ఉండాలి. స్కూలు బస్సుల వేగం 80 కిలోమీటర్లకు మించరాదు. అలాగే, బస్సు డ్రైవర్లు సుశిక్షితులై ఉండాలి. ఈ అంశాలపై స్కూలు యాజమాన్యాన్ని పేరెంట్స్ ప్రశ్నించగలిగితే, స్కూలు పిల్లలు భద్రంగా ఇంటికి తిరిగొస్తారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









