పంజాబ్లో అగ్ని ప్రమాదం..ఏడుగురి సజీవ దహనం
- April 20, 2022
లుథియానా: పంజాబ్లోని లుథియానాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.ఈ రోజు తెల్లవారుజామున తాజ్పూర్ రోడ్డులోని ఓ గుడిసెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దంపతులు సహా ఐదుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు.వారంతా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.మృతుల్లో దంపతులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నారని చెప్పారు.
ఆ సమయంలో వేరే ప్రాంతంలో వీరి మరో కుమారుడు రాజేశ్(17) నిద్రించడంతో అతడు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలడని వివరించారు.ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్రమాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబ సభ్యులు మృతి చెందారని అన్నారు.అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







