పంజాబ్‌లో అగ్ని ప్రమాదం..ఏడుగురి సజీవ దహనం

- April 20, 2022 , by Maagulf
పంజాబ్‌లో అగ్ని ప్రమాదం..ఏడుగురి సజీవ దహనం

లుథియానా: పంజాబ్‌లోని లుథియానాలో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది.ఈ రోజు తెల్ల‌వారుజామున తాజ్‌పూర్‌ రోడ్డులోని ఓ గుడిసెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దంపతులు సహా ఐదుగురు చిన్నారులు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు.వారంతా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.మృతుల్లో దంప‌తులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నార‌ని చెప్పారు.

ఆ స‌మ‌యంలో వేరే ప్రాంతంలో వీరి మరో కుమారుడు రాజేశ్‌(17) నిద్రించ‌డంతో అత‌డు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలడ‌ని వివ‌రించారు.ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్ర‌మాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబ స‌భ్యులు మృతి చెందార‌ని అన్నారు.అగ్ని ప్ర‌మాదం ఎలా చోటు చేసుకుంద‌న్న విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com