మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో ఇద్దరు భారతీయులకు జాక్పాట్..
- April 23, 2022
దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో ఇద్దరు భారత ప్రవాసులు జాక్పాట్ కొట్టారు.తాజాగా నిర్వహించిన వీక్లీ డ్రాలో భాగంగా చెరో 1,00,000 దిర్హమ్స్ గెలుచుకున్నారు.దుబాయ్లో సేల్స్మెన్గా చేసే సల్ఫికర్(34), అకౌంటెంట్గా పనిచేసే కొచప్పన్కు ఇలా ఒకేసారి జాక్పాట్ తగిలింది.దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. సల్ఫికర్ మాట్లాడుతూ.. లక్కీ డ్రాలో తాను గెలిచిన విషయాన్ని మొదట ఖతార్లో ఉండే తన స్నేహితుడు ఫోన్ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నాడు. అయితే, ఏదో ఆటపట్టించేందుకు అతడు అలా చెబుతున్నాడని నమ్మలేదట. వెంటనే ఆన్లైన్ ద్వారా ర్యాఫిల్ విజేతల వివరాలను చెక్ చేసుకున్నట్లు చెప్పాడు. అందులో తన పేరు కూడా ఉండడంతో ఆనందంతో గంతేసినంత పని చేసినట్లు చెప్పుకొచ్చాడు.
ఇక తాను గెలుచుకున్న ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని స్వదేశంలో తన కలల ఇంటిని నిర్మించుకోవడానికి ఖర్చు చేస్తానన్నాడు. అలాగే మిగిలిన నగదును తన పిల్లల చదువుకు వినియోగిస్తానని తెలిపాడు. మరో విజేత కొచప్పన్ మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను ఇంత భారీ మొత్తం గెలిచానంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నాడు. చాలా ఏళ్లుగా క్రమం తప్పకుండా మహజూజ్ ర్యాఫిల్ లో పాల్గొంటున్నట్లు తెలిపాడు. ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోలేదని, ఏదో ఒకరోజు భారీ మొత్తం గెలుస్తాననే నమ్మకంతో చాలా ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. ఏళ్ల తరబడి ఇలా కంటిన్యూస్గా లాటరీ టికెట్లు కొనడం చూసి స్నేహితులు కూడా తనను ఆటపట్టించారని కొచప్పన్ తెలిపాడు. వారి మాటలను పట్టించుకోకుండా తాను చేసిన ప్రయత్నమే ఇన్నాళ్లకు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశాడు. ఇక కరోనా కారణంగా రెండున్నరేళ్లుగా తన కుటుంబాన్ని కలవలేకపోయాని, తాను గెలిచిన ఈ భారీ నగదు చేతికి రాగానే వెంటనే స్వదేశానికి వచ్చి ఫ్యామిలీతో కలుస్తానని చెప్పుకొచ్చాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







