‘ఆచార్య ‘ ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి
- April 24, 2022
హైదరాబాద్: లెజండరీ హీరో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో , అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం’ ఆచార్య’. బ్లాక్ బర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వవహిస్తున్నారు.. ఈ మూవీ ఈ నెల 29న విడుదల కాబోతోంది. కాజల్ అగర్వాల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.. ఈ సందర్భంగా శనివారం రాత్రి యూసఫ్ గూడ లోని టి ఎస్పీ ఎస్పీ 1వ బెటాలియెన్ మైదానంలో అభిమానుల కోలాహలం మధ్య ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడారు . ఇపుడు తెలుగు ఇండస్ట్రీ గర్వపడేలా బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు నిరూపించాయని అన్నారు. ఇందుకు దర్శకుడు రాజమౌళి ఎంతైనా అభినంద నీయుడని అన్నారు.. రాజమౌళి మన తెలుగు వాడు కావటంమన అదృష్టమన్నాడు. భారతీయ సినిమా ఒక మఠం అయితే ఆ మఠానికి పీఠాధిపతి రాజమౌళి అని పేర్కొన్నారు..
అనంతరం రాజమౌళిని శాలువాతో ఘనంగా సత్కరించారు. చరణ్ ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచాడని అన్నారు . ఈ సినిమా అందరి మన్ననలు పొందుతుందని అన్నారు. కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ, రాంచరణ్, పూజ హెగ్డే, రామజోగయ్య శాస్త్రి. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ లక్ష్మణ్, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









