ఒమన్ లో 18 కొత్త పెట్టుబడి అవకాశాలు
- April 24, 2022
ఒమన్:పర్యాటకం, వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగాలలో పద్దెనిమిది కొత్త పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MOCIIP) ఆదివారం వెల్లడించనుంది. ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC)లో జరిగే ఈ ఈవెంట్ను హెరిటేజ్, టూరిజం మంత్రి సలీం బిన్ మహ్మద్ అల్ మహ్రూఖీ స్పాన్సర్ చేయనున్నారు. ASAAS (మస్కట్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ), ఒమ్రాన్ (ఒమన్ టూరిజం డెవలప్మెంట్ కంపెనీ), ఒమన్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ హోల్డింగ్ కంపెనీలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, మార్కెట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనాలను నిర్వహించారు. ఆర్థిక పెట్టుబడుల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడం, పెట్టుబడిదారులకు సరైన వాతావరణాన్ని సృష్టించడం, ప్రైవేట్ రంగ పెట్టుబడులకు సాధికారత, ప్రోత్సాహం అందించడం, ఎఫ్డిఐని పెంచడానికి ఒమన్ను పెట్టుబడి గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పెట్టుబడి అవకాశాలను ‘ఇన్వెస్ట్ ఇన్ ఒమన్’ వేదిక ద్వారా తెలిపే ఏర్పాట్లు చేశారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









