16 యూట్యూబ్ చానళ్లను బ్యాన్ చేసిన భారత్
- April 25, 2022
న్యూఢిల్లీ: తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ దేశ భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న 16 యూట్యూబ్ న్యూస్ చానళ్లను బ్యాన్ చేస్తున్నట్లు భారత కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.ఇందులో పది యూట్యూబ్ చానళ్లు ఇండియాకు సంబంధించినవి కాగా ఆరు యూట్యూబ్ చానళ్లు పాకిస్తాన్కు సంబంధించినవి తెలిపారు. ప్రస్తుతం బ్యాన్ చేయబడిన యూట్యూబ్ చానళ్ల వివర్షిప్ 68 కోట్లు ఉందని, అయితే వీరు యూట్యూబ్ వేదికను భారత్లో భయాందోలనలు సృష్టించడానికి, మత సామరస్యాన్ని పాడు చేయడానికి, అలాగే ప్రజా జీవినానికి ఇబ్బందికలేగా తప్పుడు వార్తలు, ఆధారాలు లేని సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీటితో పాటు మరొక ఫేస్బుక్ ఖాతాను కూడా ప్రభుత్వం బ్యాన్ చేసింది. కొవిడ్ సమయంలో భారత్లో లాక్డౌన్పై అనేక తప్పుడు కథనాల్ని ఈ యూట్యూబ్ చానళ్లలో ప్రచారం జరిగిందని, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని అబద్దాలు ప్రచారం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
బ్యాన్ అయిన యూట్యూబ్ చానళ్ల వివరాలు...
భారత్ నుంచి:1.సైనీ ఎడ్యూకేషన్ రీసెర్చ్2. హిందీ మే దేఖో3.టెక్నికల్ యోగేంద్ర4. ఆజ్ తే న్యూస్5. ఎస్బీబీ న్యూస్6. డిఫెన్స్ న్యూస్ 24X77.ది స్టడీ టైమ్స్8. లేటెస్ట్ లప్డేట్9. ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్10. తాహాఫుజ్ ఏ దీన్ ఇండియా
పాకిస్తాన్ నుంచి:1.ఆజ్తక్ పాకిస్తాన్2. డిస్కవర్ పాయింట్3. రియాలిటీ చెక్స్4. కైసర్ ఖాన్5. ది వాయిస్ ఆఫ్ ఏషియా6. బోల్ మీడియా బోల్
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







