వీసా ఆన్ అరైవల్పై మలేషియా కీలక నిర్ణయం
- April 29, 2022
కౌలాలంపూర్: భారత ప్రయాణికులకు మలేషియా తీపి కబురు చెప్పింది. వీసా ఆన్ అరైవల్పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. కాగా.. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..కొవిడ్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. వీసాల జారీ నిలిపివేయడంతోపాటు విమాన సర్వీసులను కూడా రద్దు చేశాయి. మలేషియా కూడా ఇదే పద్ధతి కొనసాగించింది. అయితే ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో దాదాపు అన్ని దేశాలు ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్నాయి. మలేషియా కూడా ఏప్రిల్ 1 నుంచి అన్ని కొవిడ్ ఆంక్షలను ఎత్తేసింది. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థపై దృష్టిసారించిన ఆ దేశ ప్రభుత్వం.. టూరిస్ట్లను ఆకర్షించడం ద్వారా తిరిగి బలపడాలని చూస్తోంది.ఈ నేపథ్యంలో ముఖ్యంగా భారత టూరిస్ట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. వీసా ఆన్ అరైవల్ సర్వీసును తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే భారత ప్రయాణికులకు ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుందని మలేషియాస్ ఇంటర్నేషనల్ ప్రమోషన్ డివిజన్ డైరెక్టర్ మనోహరన్ పెరియస్వామి ఓ ప్రకటనలో చెప్పారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







