భారత్ కరోనా అప్డేట్

- April 29, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 3,377 మందికి పాజిటివ్​గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,496 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 72వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసులు.. 17801 మొత్తం మరణాలు.. 523753 మొత్తం కేసులు 4,30,72,176 రికవరీలు..4,25,30,622

కాగా, దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 22,80,743 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,65,46,894 కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 6,28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,561 మంది ప్రాణాలు కోల్పోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com