షూటింగ్లో హీరో గోపీచంద్కి ప్రమాదం..
- April 29, 2022మైసూరు: హీరో గోపీచంద్ ఇటీవలే సీటిమార్ సినిమాతో చాలా రోజుల తర్వాత సక్సెస్ అందుకున్నాడు. గోపీచంద్ త్వరలో పక్కా కమర్షియల్ సినిమాతో రానున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ తన 30వ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.గోపీచంద్ కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా ఇది రానుంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతుంది.అయితే షూటింగ్ జరుగుతుండగా స్పాట్ లో హీరో గోపీచంద్ కాలు జారి కింద పడ్డారు.వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లగా కేవలం బెణికింది, ఎలాంటి ప్రమాదం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు అని చెప్పినట్టు సమాచారం.ఈ ఘటనపై దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ.. గోపీచంద్ షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడ్డారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.
తాజా వార్తలు
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..
- కార్ల దగ్గర ఆయిల్ స్లిక్.. నివాసితుల ఆందోళన
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..