ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- July 04, 2026
అబుదాబి, జూలై 4: యూఏఈలో తొలి ప్రయాణికుల రైలు సేవలను ప్రారంభించిన ఎతిహాద్ రైల్ సంస్థ టికెట్ ధరలు, రద్దు, మార్పులకు సంబంధించిన నిబంధనలను వెల్లడించింది. సేవలు ప్రారంభానికి ముందే 10 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడంతో ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ప్రారంభ ఆఫర్లో భాగంగా పెద్దల టికెట్లపై 50 శాతం తగ్గింపు అందిస్తున్నారు. దీంతో కంఫర్ట్ క్లాస్ టికెట్లు AED 55 నుంచి, ప్రీమియం క్లాస్ టికెట్లు AED 120 నుంచి లభిస్తున్నాయి.
టికెట్ ధరల్లో చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక రాయితీలు కల్పించారు. 17 ఏళ్లలోపు పిల్లలకు సాధారణ టికెట్ ధరపై 50 శాతం తగ్గింపు ఉంటుంది. 14 ఏళ్లలోపు పిల్లలు తప్పనిసరిగా పెద్దలతో కలిసి ప్రయాణించాలి. రెండేళ్లలోపు శిశువులు పెద్దల ఒడిలో కూర్చుంటే ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే వారికి ప్రత్యేక సీటు కావాలంటే చిన్నారి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
అలాగే 60 ఏళ్లు పైబడిన ప్రయాణికులకు టికెట్ ధరపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నారు. అవసరమైతే వయస్సు నిర్ధారణకు సంబంధించిన గుర్తింపు పత్రాలు చూపించాలని అధికారులు సూచించారు.
టికెట్ రద్దు–రీఫండ్ నిబంధనలు
ప్రయాణికులు టికెట్ను ఎతిహాద్ రైల్ మొబైల్ యాప్, అధికారిక వెబ్సైట్లోని 'మై బుకింగ్స్' విభాగం, కాల్ సెంటర్ లేదా స్టేషన్లలోని టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా రద్దు చేసుకోవచ్చు.
టికెట్ రకాన్ని బట్టి రీఫండ్ నిబంధనలు ఇలా ఉన్నాయి:
- సేవర్ (Saver): రీఫండ్ లేదు.
- వాల్యూ (Value): రీఫండ్ లేదు.
- ఫ్లెక్స్ (Flex): ప్రయాణానికి 24 గంటల కంటే ముందే రద్దు చేస్తే పూర్తి రీఫండ్ లభిస్తుంది. 24 గంటలలోపు రద్దు చేస్తే 30 శాతం రద్దు ఛార్జీ మినహాయించి మిగిలిన మొత్తం తిరిగి చెల్లిస్తారు. ప్రయాణానికి హాజరుకాకపోతే ఎలాంటి రీఫండ్ ఉండదు.
టికెట్ మార్పులకు అవకాశం
ప్రయాణికులు యాప్, వెబ్సైట్, టికెట్ వెండింగ్ మెషీన్లు లేదా కాల్ సెంటర్ ద్వారా టికెట్ తేదీ, సమయాన్ని మార్చుకోవచ్చు. అయితే ప్రయాణ మార్గం, ప్రారంభ లేదా గమ్య స్టేషన్ను మార్చుకునే అవకాశం ఏ టికెట్ రకానికీ ఉండదు.
సేవర్: మార్పులకు అనుమతి లేదు.
వాల్యూ: ప్రయాణానికి 72 గంటల ముందు వరకు తేదీ, సమయాన్ని ఉచితంగా మార్చుకోవచ్చు. అనంతర మార్పులకు AED 20తో పాటు వర్తించే చార్జీల వ్యత్యాసం చెల్లించాలి.
ఫ్లెక్స్: నిర్ణీత ప్రయాణ సమయానికి ముందు, అలాగే రైలు బయలుదేరిన తర్వాత 30 నిమిషాల వరకు తేదీ, సమయాన్ని ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. అవసరమైతే చార్జీల వ్యత్యాసం చెల్లించాలి.
టికెట్లో మార్పులు చేసిన తర్వాత కొత్త టికెట్ జారీ అవుతుందని, పాత టికెట్ చెల్లుబాటు కాదని ఎతిహాద్ రైల్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







