బలవంతంగా వ్యభిచారంలోకి.. మహిళపై విచారణ
- May 01, 2022
బహ్రెయిన్: మరో మహిళను మోసం చేసి వ్యభిచారంలోకి దింపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 ఏళ్ల ఆసియా మహిళ కేసు విచారణను హై క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ భర్త నకిలీ జాబ్ ఆఫర్ను అందించి బాధితురాలిని బహ్రెయిన్లోకి రప్పించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యభిచారం చేయాలని బాధితురాలిని దారుణంగా కొట్టారని చెప్పారు. బాధితురాలు తనను నిర్బంధించిన అపార్ట్ మెంట్ నుండి తప్పించుకుని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి సాయంతో పోలీసు స్టేషన్కు చేరుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఓ మహిళను బందీగా ఉంచి, ఆమెను వ్యభిచారంలోకి దింపినట్లు సదరు మహిళపై అభియోగాలు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







