బలవంతంగా వ్యభిచారంలోకి.. మహిళపై విచారణ
- May 01, 2022
బహ్రెయిన్: మరో మహిళను మోసం చేసి వ్యభిచారంలోకి దింపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 42 ఏళ్ల ఆసియా మహిళ కేసు విచారణను హై క్రిమినల్ కోర్టు వాయిదా వేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ భర్త నకిలీ జాబ్ ఆఫర్ను అందించి బాధితురాలిని బహ్రెయిన్లోకి రప్పించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం వ్యభిచారం చేయాలని బాధితురాలిని దారుణంగా కొట్టారని చెప్పారు. బాధితురాలు తనను నిర్బంధించిన అపార్ట్ మెంట్ నుండి తప్పించుకుని.. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి సాయంతో పోలీసు స్టేషన్కు చేరుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం 42 ఏళ్ల మహిళను అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ఓ మహిళను బందీగా ఉంచి, ఆమెను వ్యభిచారంలోకి దింపినట్లు సదరు మహిళపై అభియోగాలు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







