మళ్లీ ఎంఎస్ ధోనీకే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు..!
- May 01, 2022
చెన్నై: రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు.. ఇప్పటివరకు చెన్నై ఎనిమిది మ్యాచ్ లు ఆడగా, కేవలం రెండింటిలో మాత్రమే విజయుం సాధించింది.దీనితో జట్టు యాజమాన్యం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది. ''ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని కోరాం.నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు.ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు'' అని జట్టు యాజమాన్యం వెల్లడించింది. కాగా ధోని చెన్నై జట్టుకు ముందునుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.. ఇప్పటివరకు ఆ జట్టుకు నాలుగు IPL టైటిల్స్ అందించాడు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







