మళ్లీ ఎంఎస్ ధోనీకే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు..!
- May 01, 2022చెన్నై: రవీంద్ర జడేజా సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించినంతగా రాణించడం లేదు.. ఇప్పటివరకు చెన్నై ఎనిమిది మ్యాచ్ లు ఆడగా, కేవలం రెండింటిలో మాత్రమే విజయుం సాధించింది.దీనితో జట్టు యాజమాన్యం కీలకమైన నిర్ణయం తీసుకుంది. జట్టు నాయకత్వ బాధ్యతలను మళ్లీ ఎంఎస్ ధోనీకి అప్పగించింది. ''ఆటపై దృష్టిసారించేందుకే రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. అందుకే జట్టును నడిపించాలని ఎంఎస్ ధోనీని కోరాం.నాయకత్వ పగ్గాలను అందుకునేందుకు ఎంఎస్ ధోనీ అంగీకరించాడు.ఇక నుంచి జడేజా తన ఆటపై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తాడు'' అని జట్టు యాజమాన్యం వెల్లడించింది. కాగా ధోని చెన్నై జట్టుకు ముందునుంచి కెప్టెన్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.. ఇప్పటివరకు ఆ జట్టుకు నాలుగు IPL టైటిల్స్ అందించాడు.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?