అమరావతిలో ఉగాది రోజున బాలకృష్ణ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలు..
- April 05, 2016
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఈ నెల 8న హీరో బాలకృష్ణ తాను నటించబోయే వందవ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను వెల్లడించనున్నారు. అమరావతి (అప్పటి ధాన్య కటకం.. ఇప్పటి ధరణికోట రాజధానిగా చేసుకుని శాతవాహనులు సుధీర్ఘకాలం పరిపాలిం చారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతిగా నామ కరణం చేయడం సర్వజనామోదం పొందింది. శాతవాహన చివరి చక్రవర్తి గౌతమీ పుత్ర శాతకర్ణి జీవిత వృత్తాంతాన్ని ప్రస్తుతం వెండితెరపైకి తీసు కువచ్చి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్నారు. శాతకర్ణి పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా జాతీయ స్థాయి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైన కంచె సినిమా దర్శకుడు క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. బాలకృష్ణ నటించిన డిక్టేటర్ అమరావతిలో తొలిసారి ఆడియో ఫంక్షన్ నిర్వహించారు. ఇది ఘన విజ యం సాధించింది. అదే సెంటిమెంట్తో ఉగాది పర్వదినం రోజున రాజధాని అమరావతిలో బాలకృష్ణ తన నూరవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి విశేషాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాతో శా తవాహనుల చరిత్ర నేటి తరానికి తెలియనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







