కువైట్లో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
- May 04, 2022
కువైట్: కువైట్లో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. కొన్ని రూట్లలో విమాన టిక్కెట్ల ధరలు 70 నుండి 150 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ఈ సంవత్సరం సుదీర్ఘ సెలవుల కారణంగా కువైట్ నుండి ప్రయాణీకులు యూఏ, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ లకు ఎక్కువగా వెళ్లారు. దీంతో ఆయా మార్గాల్లో టిక్కెట్ ధరలకు అధిక డిమాండ్ ఏర్పడింది. కువైట్ ఎయిర్వేస్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ వేల్ అల్ హసావి మాట్లాడుతూ.. ఈద్ సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణికులు వివిధ దేశాలకు ప్రయాణించారు. కొన్ని రూట్లలో డిమాండ్ ను తగ్గట్లుగా విమానాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏప్రిల్ 28 నుండి మే 7 వరకు 2,800 విమానాలను నడుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈద్ సందర్భంగా 76 అదనపు విమానాలను నడిపినట్లు అల్ హసావి తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







