కువైట్లో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
- May 04, 2022
కువైట్: కువైట్లో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. కొన్ని రూట్లలో విమాన టిక్కెట్ల ధరలు 70 నుండి 150 శాతం వరకు పెరుగుదల నమోదైంది. ఈ సంవత్సరం సుదీర్ఘ సెలవుల కారణంగా కువైట్ నుండి ప్రయాణీకులు యూఏ, యూఏఈ, టర్కీ, ఈజిప్ట్ లకు ఎక్కువగా వెళ్లారు. దీంతో ఆయా మార్గాల్లో టిక్కెట్ ధరలకు అధిక డిమాండ్ ఏర్పడింది. కువైట్ ఎయిర్వేస్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ వేల్ అల్ హసావి మాట్లాడుతూ.. ఈద్ సందర్భంగా ఎక్కువ మంది ప్రయాణికులు వివిధ దేశాలకు ప్రయాణించారు. కొన్ని రూట్లలో డిమాండ్ ను తగ్గట్లుగా విమానాల సంఖ్యను పెంచినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఏప్రిల్ 28 నుండి మే 7 వరకు 2,800 విమానాలను నడుపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈద్ సందర్భంగా 76 అదనపు విమానాలను నడిపినట్లు అల్ హసావి తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







